25శాతం పేదలకు: ప్రైవేట్ స్కూల్స్కు సుప్రీంకోర్టు షాక్
అన్ ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రమే ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అన్ని రకాల పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు కేటాయించాలని తీర్పు చెప్పింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందని విద్యా సంస్థలైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం సాయం పొందడం పొందక పోవడంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం మాత్రం తప్పని సరి అని ఆదేశించింది. ఈ చట్టాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని చెప్పింది. సుప్రీం తీర్పు ప్రయివేట్ విద్యాసంస్థలకు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.
రాజస్థాన్ విద్యా సంస్థల సంఘం పిటిషన్ పైన సుప్రీం గురువారం తీర్పు చెప్పింది. విద్యా హక్కు చట్టం తమకు వర్తించదంటూ రాజస్థాన్ ప్రయివేటు పాఠశాలల సంఘం ఇటీవల పిటిషన్ వేసింది. ఈ మేరకు కోర్టు తీర్పు చెప్పింది.