ఆఫ్ఘనిస్తాన్లో వరుస పేలుళ్లు, పార్లమెంట్పై దాడి
కాబుల్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోనూ తీవ్రవాదాలు దాడులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు పైన దాడి జరిగింది. పార్లమెంటు భవనంలోకి చొచ్చుకు వెళ్లిన తీవ్రవాదాలు కాల్పులు జరిపి, రాకెట్లు ప్రయోగించారు. ఇది నగరంలోని ఉత్తర దిశలో ఉంది. దుండగులు హోటల్, రాయబార కార్యాలయాల పైన రాకెట్లు ప్రయోగించారు. ఒక్కసారిగా జరిగిన వరుస పేలుళ్లతో కాబుల్ వణికి పోయింది.
ఆప్ఘనిస్తాన్ పార్లమెంటు లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దాడులు చేశారు. కాబుల్లోని భారత రాయబార కార్యాలయం సురక్షితంగా ఉంది. మొదట తీవ్రవాదులు ప్రెసిడెన్షియల్ పక్కన ఉన్న స్టార్ హోటల్ను, ఇరానియన్ ఎంబసీని ముట్టడించి, వాటిని తమ వశం చేసుకొని బ్లాక్ స్మోక్ను పోయడం ప్రారంభించారని తెలుస్తోంది.
కాగా ఈ దాడులపై ఎంబసీలు అప్పుడే స్పందించేందుకు నిరాకరించాయి. దాడుల నేపథ్యంలో రాజధాని నగరం యొక్క భద్రతను పర్యవేక్షించే ఆఫ్ఘన్ భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి.