శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలకే సిఎం సమస్యలు చెప్పుకుంటున్నారు: బాజిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy Govardhan Reddy
శ్రీకాకుళం: వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సోమవారం అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకే తన సమస్యలను ఏకరువు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ తన సమస్యలు ప్రజలకు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

వైయస్ తర్వాత కాంగ్రెసు పార్టీకి ప్రజలు ఇస్తున్న ప్రోగ్రెసును గుర్తించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో వెళుతుండగా కాంగ్రెసు రెండు నాలుకల సిద్ధాంతంతో ముందుకు వెళుతుందని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన ముహూర్తం సరిగా లేదేమో అన్న కిరణ్ ఇప్పుడు ఉప ఎన్నికలకు మంచి ముహూర్తం చూసుకొని వెళ్లమని సూచించారు.

ముఖ్యమంత్రి నిర్వేదం, కాంగ్రెసు దుస్థితికి అద్దం పడుతోందన్నారు. దీనికి కారణాలు గుర్తించాలని సూచించారు. వైయస్ పైన కుట్రలు, కుతంత్రాల ఫలితంగానే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం వైయస్ తీవ్రంగా కష్టపడ్డారన్నారు. ఆయన పథకాలను తుంగలో తొక్కి ఒకటి రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టి తామేదో చేస్తున్నట్లు కిరణ్ ప్రభుత్వం చేస్తుందని, దానిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెసు అన్ని నియోజకవర్గాలలో డిపాజిట్ కోల్పోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెసు కోసం కష్టపడ్డప్పుడు వైయస్‌ను ఆ పార్టీ కులం అడగలేదని ఇప్పుడు మాత్రం తమ పార్టీ అధినేత జగన్‌ను ఎదుర్కొనేందుకు కులం అడుగుతున్నారని విమర్శించారు. రాహుల్, సోనియా కులం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు.

రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఓటు వేయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరసన్నపేట నియోజకవర్గంలో ప్రసంగించారు. మీరు వేసే ఓటు పాలకులకు కనువిప్పు కలిగించాలన్నారు. ప్రతి ఓటు రైతన్నకు, పేదవాడికి వేస్తున్నట్లుగా భావించాలన్నారు. పదవి పోతుందని తెలిసినా కృష్ణదాస్ రైతులకు, పేదవారికోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.

English summary
YSR Congress Party spokes persons Bajireddy Govardhan Reddy said chief minister Kiran Kumar Reddy is saying his problems to peoples. He said after late YS Rajasekhar Reddy death, Congress did not won one seat in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X