రెండో పెళ్లి: భర్తను స్తంభానికి కట్టేసి చెప్పుతో కొట్టిన భార్య
అయితే సదరు భర్త మరో మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆ భార్య ఓర్చుకోలేక పోయింది. వెంటనే ఇంట్లో ఉన్న తన భర్తను స్థానిక కాలనీవాసులు, తన బంధువుల అండతో బయటకు లాక్కొచ్చింది. దగ్గరలో ఉన్న స్తంభానికి కట్టి వేసి ఆయనను బాదింది. చెప్పు తీసి కొట్టింది. చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులు కూడా ఆ భర్తకు దేహశుద్ది చేశారు.
విశాఖపట్నం ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న యాభై కిలోల గంజాయిని సికింద్రాబాదులో రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. ఈ గంజాయిని సూరత్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
కాగా పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన మహిళ వారం క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన ఇక్బాల్ తాపీ పనులు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఇక్బాల్ తన భార్య ఫర్వీన్ను బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం సౌదికి పంపాడు. వారం క్రితం సౌదీలో జరిగన రోడ్డు ప్రమాదంలో ఫర్వీన్ మృతి చెందినట్లు భర్తకు సమాచారం అందింది. ఆమె మృతదేహాన్ని పాకాలకు తీసుకు రానున్నారు.