ఈసీదే: చిరంజీవి, విజయకాంత్ పార్టీలకు సుప్రీం షాక్!
దీంతో అప్పటి చిరంజీవి ఆధ్వర్యంలోని ప్రజారాజ్యం, జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలోని లోక్సత్తా, తమిళనాడులోని విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె పార్టీలు ఈసి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాయి. (ఇప్పుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు) ఈ కేసులో కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువర్చింది. పిఆర్పీ, లోక్సత్తా, డిఎండికె పిటిషన్లను కోర్టు తోసి పుచ్చింది.
గుర్తింపు పొందిన పార్టీలకే ఎన్నికలలో శాశ్వత చిహ్నం కేటాయిస్తామని ఈసి అప్పుడు ఆ పార్టీలకు తెలిపింది. తాజాగా కోర్టు తన తీర్పులో పార్టీలకు నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించాలని సూచించింది. పిటిషన్లను కొట్టివేసింది. కాగా ఈసికి అనుకూలంగా జస్డిస్ ఎస్ఎస్ నిజ్జార్, జస్టిస్ అల్తమాస్ కబీర్ తీర్పునిచ్చారు.
అయితే ఆర్టికల్-14ను ఈసి ఉల్లంఘిస్తుందన్న జస్టిస్ చలమేశ్వర్ జడ్జిల తీర్పుతో విభేదించి చట్టం అందరికీ సమానమేనన్నారు. కామన్ సింబల్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు కీలక తీర్పు ఇవ్వడంతో 2008లో దాఖలైన పిటిషన్లపై తెర పడినట్లయింది. కాగా ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీకి కామన్ సింబల్ రావాలంటే ఒక పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు శాసనసభ్యులు ఆ పార్టీకి ఉండాలి. లేదా ఓట్ల శాతం ఉండాలి.