సీడి వివాదం: పార్టీ బ్రీఫింగ్స్ నుంచి సింఘ్వీ అవుట్
సీడి వివాదంలో చిక్కుకోవడం వల్లనే సింఘ్వీని మీడియా బ్రీఫింగ్స్ నుంచి తప్పించారా అని అడిగితే ఈ సోమవారం సింఘ్వీ అందుబాటులో ఉండరని, అంతకు మించి చెప్పలేమని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. పతన చుట్టూ చెలరేగుతున్న వివాదాలకు స్వస్తి చెప్పాలని ప్రతి సోమవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే సింఘ్వీ అన్నారు.
మీడియా బ్రీఫింగ్ వద్దని తనకు సోమవారం ఉదయం చెప్పారని ఆయన అన్నారు. ప్రముఖ న్యాయవాది కూడా అయిన సింఘ్వీకి సంబంధించిన సీడి వివరాలను ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు మీడియా సంస్థలను ఆదేశించింది.
సిడీని తారుమారు చేశారని, మార్ఫింగ్ చేశారని సింఘ్వీ ఆరోపిస్తున్నారు. ఆ సిడీలోని విషయాలను ప్రసారం చేస్తే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన హైకోర్టుకు చెప్పుకున్నారు. తన హక్కును దెబ్బ తీయడమే అవుతుందని ఆయన అన్నారు. దీంతో సిడిలోని విషయాలను ప్రచురించడం గానీ ప్రసారం చేయడం గానీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సోమవారం తనకు కాస్తా అస్వస్థత ఉందని సింఘ్వీ చెప్పారు.