వైయస్ సిఫార్సుతో విజయ నిర్మలకు విల్లా: సిబిఐ
టీవీ చానెళ్ల కథనాల ప్రకారం - విల్లాల కొనుగోలులో విజయరాఘవ అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. శ్రవణ్ గుప్తా పేరును కూడా సిబిఐ నిందితుల జాబితాలో చేర్చింది. సునీల్ రెడ్డి 96 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కీలకమని సిబిఐ చెప్పింది. సునీల్ రెడ్డి ద్వారా విఐపిలు లావాదేవీలు నడిపినట్లు ఆరోపించింది.
విజయరాఘవ 18 విల్లాలను తన సొంతవారికి కట్టబెట్టారని తెలిపింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ విల్లాల వ్యవహారంలో భారీ మొత్తాల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. చార్జిషీట్ తమకు ఇవ్వాలంటూ వారిద్దరి తరఫు న్యాయవాదులు కోర్టులో మెలో దాఖలు చేశారు. ఎమ్మార్ కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ పలువురు ప్రముఖులను ఇప్పటికే విచారించింది. విల్లాలను కొనుగోలు చేసినవారి నుంచి వాంగ్మూలాలను స్వీకరించింది. కాంగ్రెసు నాయకుడు డి. శ్రీనివాస్ సహా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కోడలు బ్రాహ్మణి వంటి పలువురి వాంగ్మూలాలను స్వీకరించింది.