ఇంటర్ సెకండియర్లోనూ బాలికలదే హవా
బాలురు 55.94 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 61.25 శాతం మంది పాసయ్యారు. కాగా, 7 లక్షల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలురాయగా 4 లక్షల 41 వేల 966 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 58.43 శాతం మంది విద్యార్థినీవిద్యార్థులు పాసయ్యారు. ఇది గత సంవత్సరం కన్నా 4.83 శాతం తక్కువ.
ఇంటర్ సెకండియర్ ఫలితాలకు క్లిక్ చేయండి
ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపరులో సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయని, అందువల్లనే ఫలితాలు తగ్గాయని అంటున్నారని, అయితే మూస పద్ధతిలో చదివించడం వల్ల అలా అనిపించిందని, తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకం నుంచే ప్రశ్నలు ఇచ్చారని మంత్రి వివరించారు. ప్రశ్న పత్రాల్లో ఏ విధమైన లోపాలు లేవని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 74 శాతం మంది పాసయ్యారు. పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 43 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల మెమోలను ఈ నెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్కు పంపిస్తామని ఆయన చెప్పారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మే 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మే 23వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను 39 వెబ్సైట్లలో ఉంచుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంకులు ఆధారపడి ఉంటాయి.