కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల హంతకులతో: జగన్‌పై వీరశివా సంచలన వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy
కడప: కాంగ్రెసు పార్టీ కమలాపురం సీనియర్ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర, మద్దెలచెర్వు సూరి హత్యల కేసులలోని నిందితులతో వైయస్ జగన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెరాసతో కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సమైక్యవాదులు ఈ విషయాన్ని గుర్తించాలని వీర శివా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలలో జగన్‌కు ఓటు వేయవద్దన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు.

కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తనకు మంగళి కృష్ణతో పరిచయం ఉందని భాను విచారణలో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయ. మంగళి కృష్ణతో జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇరువురిది పులివెందులేనని, మొదటి నుండి జగన్‌కు బ్యాక్ బోన్‌గా కృష్ణ ఉన్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్‌పై వీర శివా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కెసిఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యాడని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ పలుమార్లు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్ర విభజనకు దారి తీసినట్లేనని, ఆయన రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తున్నాడని టిజి పలుమార్లు మండిపడ్డారు.

English summary
Kamalapuram MLA Veera Siva Reddy make controversial comments on YSR Congress Party president and Kadapa MP YS Jaganmohan reddy on thursday. He was alleged, YS Jagan have relation with Paritala Ravi's and Maddelacheruvu Suri's murder case accusers. He was demanded complete enquiry in this way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X