కోనేరుమధు లొంగుబాటు, ఏడాదిగా దుబాయ్లో
కోనేరు మధు గత సంవత్సరానికి పైగా దుబాయిలో ఉంటున్నాడు. ఎమ్మార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదయ్యాక, పలువురిని విచారించిన పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయితే మధు దుబాయిలో ఉన్నందున విచారణ కుదరలేదు. దీంతో సిబిఐ కోర్టును ఆశ్రయించింది. కోర్టు కోనేరు మధుకు లొంగిపోవాలంటూ సమన్లు జారీ చేసింది.
దీంతో ఆయన శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మార్ ఫండ్స్ నుండి మధు ఖాతాకు డబ్బులు మళ్లించినట్లు విచారణలో సాక్ష్యులు సిబిఐకి చెప్పారు. రంగారావు ద్వారా చెల్లించిన సొమ్ము ఆయన ఖాతాలోకి వెళ్లాయని అభియోగం. కోనేరు మధు ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్ తనయుడు. మధుపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు పెట్టారు.
కాగా ఇదే కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ అక్రమాలపై అరెస్టైన శ్రీనివాస్ రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిమాండ్ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఉద్యోగాలు, సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపారనే అభియోగాలతో అరెస్టైన తారా చౌదరిని కోర్టులో హాజరు పర్చారు.