ఆఫ్ఘన్లో పెట్రేగిన టెర్రరిస్టులు, ఒబామా వెళ్లిన గంటల్లో
ఈ పేలుళ్లు అమెరికా సైనిక స్థావరానికి అతి దగ్గరలో చోటు చేసుకున్నాయి. దీంతో అమెరికా సైన్యంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. అయితే ఒబామా వెళ్లిన తర్వాత దాడులు జరగడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత చెందగా, సుమారు 150 మందికి పైగా గాయపడ్డారు. సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక పేలుడు సంభవించిన కాసేపటికి మరో పేలుడు జరిగింది. ఈ పేలుళ్లకు తాలిబన్ సంస్థ బాధ్యులుగా ప్రకటించుకుంది. గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్లో పలు విదేశీ మిలిటరీ సంస్థలు ఉంటాయి.
కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆఫ్ఘనిస్తాన్లో అకస్మికంగా పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆయన వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశారు. 2014లో నాటో మిషన్ పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపై ప్రధాన్యత ఏర్పడింది.