ఎట్టకేలకు మావోల చెర నుండి కలెక్టర్ పాల్ విడుదల
కాగా గత నెల ఏప్రిల్ 21వ తేదిన కలెక్టర్ అలెక్స్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అతనిని విడుదల చేయించడానికి బిడి శర్మ, హరగోపాల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి కృషి ఫలించింది. వీరు నాలుగు దఫాలుగా అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులతో చర్చలు జరిపారు.
మావోయిస్టుల చెరలో మీనన్ పదమూడు రోజులు ఉన్నారు. మధ్యవర్తులు ఇద్దరూ హెలికాప్టర్ ద్వారా సుకుమా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన తాడిమెట్లకు చేరుకున్నారు. అస్తమాతో బాధపడుతున్న అలెక్స్ పాల్కు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని సుకుమా, దంతేవాడ, జగ్గల్ పూర్, రాయపూర్ జిల్లాలోని వైద్య అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చింతల్నార్ వద్ద అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు.
కాగా అలెక్స్ విడుదలపై ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు పెట్టిన పలు ఒప్పందాలకు చత్తీస్గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆయనను విడుదల చేశారు. కాగా రాయపూర్కు ఐదువందల కిలోమీటర్ల దూరంలోని అడవులలో మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో కలెక్టర్ను విడుదల చేశారు.