పరిటాల హత్యకు మొద్దు శీనుకు కోటి: భాను కిరణ్
పులివెందుల కృష్ణకు కోటీ 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు భాను కిరణ్ చెప్పాడు. జల్సాలకు 40 లక్షల రుపాయలు ఖర్చయ్యాయని అతను చెప్పాడు. సూరి సోదరి హేమలతా రెడ్డికి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అతను తెలిపాడు. హంద్రీనీవా 72 కోట్ల రూపాయల 7వ ప్యాకేజీ జెకె కన్స్ట్రక్షన్కు వచ్చే చూశామని, తమకు 8.6 కోట్ల రూపాయలు కమిషన్ వచ్చిందని, దాన్ని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చామని అతను చెప్పాడు. 38 కోట్ల రూపాయల ఐదో ప్యాకేజీ కాంట్రాక్టులో సహకరించినందుకు 3.5 కోట్లు రూపాయలు తీసుకున్నామని ఆతను చెప్పాడు. ఆరో ప్యాకేజీ కూడా ఓ సంస్థకు రావడానికి సహకరించామని అతను చెప్పాడు.
సూరి హత్య తర్వాత ఉమాశంకర్ అనే వ్యక్తి 50 వేల రూపాయలు ఇచ్చాడని, అతనే సిమ్ కార్డు కూడా ఇచ్చాడని, దాంతో సూరి హత్య తర్వాత ఢిల్లీలోని శర్మ లాడ్జిలో ఉన్నానని, సింప్లెక్స్ ఉద్యోగిగా చెలామణి అయ్యాయని అతను చెప్పాడు. సూరి హత్యకు టచ్ పబ్లో ప్రణాళిక రచించినట్లు అతను తెలిపాడు. సినీ నిర్మాత సింగనమల రమేష్, మన్మోహన్ సింగ్తో కలిసి శంషాబాద్లో సూరి హత్యకు ఆరు రౌండ్ల టెస్ట్ ఫైరింగ్ జరిపినట్లు అతను తెలిపాడు.
శాసనసభ్యుడు గుర్నాథరెడ్డి తమ్ముడు రెడ్డప్పరెడ్డి 80 లక్షల రూపాయలు ఇచ్చాడని అతను చెప్పాడు. బెంగళూర్లో 2006లో ఓ సాఫ్ట్వేర్ డీల్ చేశామని, ఇందులో పులివెందుల కృష్ణ పాత్ర కూడా ఉందని భాను కిరణ్ చెప్పాడు. నందుల జగన్మోహన్ రెడ్డి, వంశీలతో కలిసి తొలి రియల్ వెంచర్ సెటిల్మెంట్ చేశామని, వచ్చిన డబ్బును న్యాయవాది శ్రీకాంత్ గౌడ్కు ఇచ్చేవాళ్లమని అతను చెప్పాడు. అన్నపూర్ణ ప్యాకేజింగ్ విషయంలోనే సూరితో విభేదాలు వచ్చినట్లు అతను చెప్పాడు.