సాక్షి మీడియా స్టాఫ్ సమాచారం అడిగిన సిబిఐ
జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, జననీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను, ఉద్యోగ తరహాలను తెలపాలని ఆయన జాయింట్ కమిషనర్లకు సూచించారు. దర్యాప్తులో భాగంగా ఆ వివరాలను తమకు అందించాలని ఆయన సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల వివరాలతో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను కూడా అందించాలని సూచించారు.
ఉద్యోగుల వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, సంస్థ సమర్పించిన రిటర్న్స్, తనిఖీల సమాచారం వంటి పత్రాలతో పాటు పూర్తి వివరాలు అందజేయాలని సిబిఐ ఎస్పీ వెంకటేష్ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్లకు సూచించింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) ఉద్యోగుల వాస్తవ సంఖ్యను సేకరించి యాజమాన్యాన్ని ప్రశ్నించే ఉద్దేశంతో ఈ వివరాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.
బ్యాంక్ ఖాతాల స్తంభన వల్ల 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారనే సాక్షి మీడియా యాజమాన్యం వాదిస్తున్న తరుణంలో సిబిఐ ఆ వివరాలు సేకరించి, సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి మీడియాలో 20 వేల మంది పనిచేస్తున్నారనే యాజమాన్యం వాదనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. ఎక్కువలో ఎక్కువ వేయి మంది ఉద్యోగులుంటారని ఆయన చెప్పారు.