జెనీవాలో రూ. 50 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం
1610లో నాలుగో హెన్రీ 35 క్యారట్ల ఆ వజ్రాన్ని ఆయన సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉంచారు. ఇది అత్యంత అరుదైన, అత్యంత సుందరమైన వజ్రమని సోత్బై ఇండియా డైరెక్టర్ మైథిలీ పరేఖ్ అన్నారు. గోల్కొండ నగరం పరిసరాల్లోని గనుల్లోనే ఈ వజ్రం జనించి ఉంటుందని అన్నారు. హోప్, కోహినూర్, రీజెంట్ వజ్రాల స్థాయి దీనికి ఉంటుందని భావిస్తున్నారు.
సోత్బై వేలం పాటలో ఐదుగురు ఆ వజ్రం కోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. వీరు మూడు వేర్వేరు ఖండాలకు చెదినవారని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, అతను ఎవరనేది తెలియడం లేదు.
నిజాం ప్రభువుల రాజధాని గోల్కొండ కోట (ఇప్పటి హైదరాబాద్ నగరం) అత్యంత చారిత్రకమైంది. సంపదకు నిలయం. నిజాం ప్రభువుల ఎనలేని సంపద ఉండేదని ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా నిజాం ప్రభువు మన్ననలు పొందాడు. వజ్రవైఢూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉండేవని అంటారు.