వద్దన్నందుకు: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఈ విషయమై బాబు ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా మారకపోవడంతో బాబు తాగుడుకు బానిసయ్యాడు. బాధతో బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భాగ్యమ్మతో ఘర్షణకు దిగాడు. గొడవ అంతకంతకు పెరిగింది. దీంతో భాగ్యమ్మ తన భర్త బాబును పక్కకు తోసేయడంతో బాబు కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాబును భాగ్యమ్మ ఇంట్లో దూలానికి కట్టేసి తీవ్రంగా కొట్టింది. తన చీరతో ఉరి వేసి చంపింది.
ఆ తర్వాత తనపై ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులను, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వారు ఆమెను అనుమానించారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమందించారు. ఓ సమయంలో పోలీసులు వారిస్తున్నా పట్టించుకోకుండా జనం ఆమెను చితకబాదారు. ఎస్సై వెంకటరావు, సిఐ అహ్మద్ భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. భాగ్యమ్మకు ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేపడుతున్నామని సిఐ తెలిపారు.
వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుడి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాగ్యమ్మపై హత్యా నేరం కేసు నమోదు చేశారు.