షిర్డీ సాయిబాబా వద్ద 280 కిలోల బంగారం
గత ఐదేళ్ల నుంచి షిర్డీ సాయిబాబాకు పలు బంగారం వస్తువులను భక్తులు విరాళంగా ఇస్తున్నారు. దీంతో సాయిబాబా కోశాగారంలో ప్రస్తుతం 280 కిలోల బంగారం చేరింది. వెండి 3,000 కిలోలు ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి.
ఓ సాయి భక్తుడు 570 గ్రాముల బరువు తూగే బంగారం కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు. దీని విలువ రూ. 14 లక్ష 88 వేలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్రలో షిర్డీలోనే సాయి బాబా జన్మించాడని భావిస్తారు. అది ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన యాత్రా స్థలంగా మారింది. సాయిబాబా 1918 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. ఆయనను ముస్లింలు, హిందువులు కూడా ఆరాధిస్తారు. ఆయనను సన్యాసిగా చెబుతారు.
హిందువులు సాయిబాబాను కృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఈ విషయాన్ని హేమద్ పంత్ అనే అతను శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకంలో రాశారు. కొంత మంది భక్తులు దత్తాత్రేయుడి అవతారంగా చెబుతారు. చాలా మంది భక్తులు మాత్రం సద్గురుగా కొలుస్తారు.