పరకాలలో మద్దతుకు సర్వే చేస్తున్నాం: కోదండరామ్
గ్రానైట్ క్వారీ లీజుల అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఇసుక లీజులపై తీసుకున్న చర్యలనే క్వారీలకు అమలు చేయానలి ఆయన సూచించారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చే వరకు నిరంతర పోరాటం జరుపుతామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మూడు నెలల్లో తెలంగాణ ప్రకటించకపోతే మళ్లీ సకల జనుల సమ్మెలకు దిగుతామని హెచ్చరించారు. పోలవరం నిర్మాణ పనులు జరగనివ్వమని కోదండరాం తేల్చిచెప్పారు.
సీల్డ్ కవర్ ద్వారా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియవని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో తెలంగాణకు మద్దతుగా కొనసాగుతున్న రిలే దీక్షలకు ఆయన మంగళవారం సంఘీభావం ప్రకటించారు ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ ప్రాంత మంత్రులు, శానససభ్యులు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు.