ఇచ్చిన డబ్బులు అడిగినందుకు యువతిపై కత్తితో దాడి
రేఖ ఇంట్లో ఆమెతో పాటు తల్లి మాత్రమే ఉంటుంది. వీరి వద్ద శ్రీనివాస్ గతంలో రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. వీటిని తిరిగి ఇవ్వాలని రేఖ అతనిని అడిగింది. ఈ డబ్బుల విషయంలో రేఖ తల్లి, శ్రీనివాస్ మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న శ్రీనివాస్ పాఠశాలకు వెళుతున్న రేఖపై కత్తితో దాడి చేశాడు.
గొంతు, ముఖంపై తీవ్ర గాయాలు అయ్యీయి. గాయపడిన రేవతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో అతనిపై రేఖ కుటుంబ సభ్యులు దాడి చేశారు. శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది. రేఖ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవకాశముంది.
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.