చెర్రి - ఉపాసన పెళ్లి: అభిమానులకు నాగబాబు విజ్ఞప్తి
వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యే అవకాశముందని చెప్పారు. తమకు అందుబాటులో ఉండే ఐదువేల మంది అభిమానులను ఈ పెళ్లికి ఆహ్వానించామని ఆయన చెప్పారు. 15వ తేదిన అభిమానులకు ప్రత్యేకంగా విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతి, భద్రాచలం దేవాలయాల నుంచి తెచ్చిన తలంబ్రాలు, పెళ్లి వస్త్రాలను అభిమానులు నాగబాబుకు అందించారు.
కాగా రామ్ చరణ్ తేజ - ఉపాసనల పెళ్లి గురువారం(14న) జరగనున్న విషయం తెలిసిందే. పెళ్లి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మొయినాబాద్ ఫాంహౌస్లో ఈ పెళ్లి జరగనుంది. పూర్తి ట్రెడిషనల్గా పెళ్లి వేదికను తీర్చి దిద్దుతున్నారు. మొయినాబాద్లో పెళ్లి కార్యక్రమాలలో సుమారు నాలుగు వందల మంది బిజీ బిజీగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
చెర్రీ మ్యారేజ్ సెట్ రాయల్ లుక్ను తలదన్నుతోంది. ముంబయి నుండి లైటింగ్స్ ప్రత్యేకంగా తెప్పించారు. పెళ్లి ఐదడుగుల ఎత్తున్న వేదికపైన జరుగుతుంది. వేదిక ముందు రెండు వేల మంది కూర్చునే విధంగా వేదిక తయారు చేశారు. ప్రధాన ప్రాంగణానికి ఓ వైపు శివాలయం మరోవైపు డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. డైనింగ్ హాల్లో వెయ్యి మంది ఒక్కసారిగా తినేవిధంగా ఏర్పాటు చేశారు.