ఇదీ మా సొంత ఊరే: ప్రతాప్ సి.రెడ్డి గ్రామంలో చిరంజీవి
అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి వెంటి గొప్ప వ్యక్తి జన్మించిన అరగొండకు రావడం తమ అదృష్టమని అన్నారు. అరగొండతో బంధుత్వం కలవడంతో మనం ఆత్మబంధువులం అయ్యామని అభిమానులను ఉద్దేశించి అన్నారు. తన ఇష్టమైవమైన శ్రీ ఆంజనేయస్వామి కొలువైన అర్ధగిరికి నూతన దంపతులను తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు నూతన దంపతులతో పాటు అందరికీ ఉండాలన్నారు.
ఉపాసన వంటి ఉత్తమురాలు తమ ఇంటి కోడలు కావడం తమ అదృష్టమన్నారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు చిరంజీవి, రామ్ చరణ్ తేజ దంపతులు అరగొండలోని ప్రతాప్ సి.రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం గ్రామంలో అపోలో గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి ప్లాంటును ప్రారంభించారు.
అర్ధగిరిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అన్నదానం కోసం చరణ్ దంపతులు, ప్రతాప్ సి.రెడ్డి దంపతులు, ఆయన కుమార్తే ప్రీత మొత్తం రూ.ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. కాగా గురువారం రామ్ చరణ్ తేజ, ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే.