శ్రీలక్ష్మి బెయిల్పై తీర్పు రిజర్వ్: నిమ్మగడ్డ బెయిల్పై
ఒఎంసి కేసులో కేంద్ర ప్రభుత్వాధికారులను ప్రశ్నించారా అని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. వారిని ప్రశ్నించేందుకు ఏమైనా ఇబ్బందులున్నాయా అని హైకోర్టు సిబిఐని అడిగింది. ఒఎంసి కేసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి అరెస్టయ్యారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.
బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఇరు వర్గాల వాదనలు ఉన్న కోర్టు ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల అరెస్టైన నిమ్మగడ్డ చంచల్గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.