ముంబై దాడులు: మహారాష్ట్ర మంత్రి ఇంట్లో టెర్రరిస్టు?
ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ మంత్రిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ మంత్రి ఎవరనేది తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) జుందాల్ను తమ కస్టడీలోకి తీసుకునే నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. జుందాల్ను ఢిల్లీ పోలీసులు ఈ నెల 21వ తేదీన సౌదీ అరేబియా నుంచి వచ్చిన వెంటనే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు జుందాల్ను 15 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదే రోజు ఆదేశాలు జారీ చేసింది.
జుందాల్ కస్టడీని కోరుతూ ముంబై పోలీసులు తీజ్ హజరీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ముంబై దాడుల కేసులో అతన్ని ముంబైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఢిల్లీ పోలీసుల అభిప్రాయాన్ని కోరింది.
జుందాల్ అరెస్టు అయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ముంబై కోర్టు సోమవారం అతన్ని తమ ముందు హాజరు పరచాలని ప్రొడక్షన్ వారంట్ జారీ చేసింది. అబూ జుందాల్ను తమ కస్టడీకి మరిన్ని రోజులు అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరే అవకాశం ఉంది. అతని ప్రస్తుత పోలీసు కస్టడీ జులై 5వ తేదీతో ముగుస్తుంది. కామన్వెల్త్ క్రీడలకు ముందు 2010లో జరిగిన జమా మసీద్ దాడి కేసుకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని జుందాల్ నుంచి రాబట్టేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.