సూరి హత్య కేసు: భాను కిరణ్ డ్రైవర్ రమేష్ అరెస్టు
సూరిని హత్య చేసిన తర్వాత పారిపోవడానికి వంశీ భాను కిరణ్కు ద్విచక్రవాహనం ఇచ్చి సాయం చేశాడని ఆరోపణలున్నాయి. సూరి హత్యకు సంబంధించిన కుట్ర తనకేమీ తెలియదని, తాను వాహనం మాత్రమే ఇచ్చానని వంశీ సిఐడి అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఐపిసి 212 సెక్షన్ కింద పోలీసులు వంశీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను సిఐడి పోలీసులు ఎప్రిల్ 1వ తేదీన అరెస్టు చేశారు. ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే వచ్చారు.
సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ పారిపోయాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను సూరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సూరి భాను కిరణ్ను తీవ్రంగా వేధించాడని, దాన్ని తట్టుకోలేక భాను సూరిని హత్య చేశాడని చెబుతూ వస్తున్నారు. భాను కిరణ్ అరెస్టుతో అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.