ఫైనాన్స్ వ్యాపారి హత్య: వరంగల్లో టిడిపి కార్యకర్త
వారు వెంటనే అక్కడ నుండి పారిపోయారు. హత్యకు ఉపయోగించిన తల్వార్లను కూడా వెంట తీసుకు వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మృతుడు ఫైనాన్స్ వ్యాపారి ఆ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పాతకక్షలే కారణం కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ దారుణ హత్యకు గురయ్యారు. మరిపెడ మండలం తాళ్లఊకల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. పాతకక్షలు మనసులో పెట్టుకున్న కాంగ్రెసు వర్గీయులు వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న టిడిపి నేత రామన్నపై కర్రలు, గొడ్డలితో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. రామన్న హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తండ్రిని చంపాడు. మాక్లూర్ మండలం చిన్నాపూర్కు చెందిన సాయన్న అతని కొడుకు సంతోష్ మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. సంతోష్ ఆవేశం పట్టలేక పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై మోదాడు. దీంతో అతను అక్కడికక్కడమే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.