ఏథెన్స్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంపై దాడి, మంటలు
ఏథెన్స్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయ భవనంలోకి దూసుకొచ్చిన వాహనంలో మూడు ప్రమాదకరమైన గ్యాస్ బండలు, ఐదు క్యాన్లో గ్యాసోలైన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ విధమైన ప్రాణహాని జరగలేదని తెలుస్తోది. గ్రౌండ్ ఫ్లోర్లో భారీ నష్టం జరిగినట్లు, మైక్రోసాఫ్ట్ ఈ రోజు పనిచేయనది పోలీసు అధికార ప్రతినిధి థానసిస్ కక్కోలకిస్ చెప్పారు.
దాడికి కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు వ్యాన్ను తనిఖీ చేశారు. గ్రీసులో స్థానిక ఉగ్రవాద గ్రూపులు ప్రభుత్వ భవనాలను, బ్యాంకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం పరిపాటి. ఈ దాడికి ఎవరు కారణమనేది తెలియదు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను దుండగులు అక్కడి నుంచి పంపించివేసి పేలుళ్లకు పాల్పడ్డారు.
స్థానిక ఉగ్రవాద గ్రూపుల దాడుల వల్ల సాధారణంగా గాయాలు మాత్రమే అవుతుంటాయి. రాత్రుళ్లు పొద్దుపోయిన తర్వాత ఉగ్రవాదులు సాధారణంగా దాడులు చేస్తుంటారు.