భారీ ఎన్కౌంటర్: 17 మంది మావోయిస్టుల మృతి
ఇది తెలుసుకున్న నక్సలైట్లు బాసగూడ సమీపానికి జవాన్లు వచ్చాక వారిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అఫ్రమత్తమైన సిఆర్పిఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడ్డ జవాన్లను రాష్ట్ర రాజధాని రాయపూర్లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరు జవాన్లకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఎదురు కాల్పులు దాదాపు ఆరు గంటలు సాగాయని సమాచారం. అవసరమైతే అదనపు బలగాలను పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాల్పుల అనంతరం సిఆర్పిఎఫ్ జవాన్లు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని వారిని రాయపూర్ తరలించారు. గాయపడ్డ ఆరుగురు జవాన్లలో ఇద్దరు కోబ్రా కమాండోస్కు చెందిన వారిని అధికారులు చెప్పారు. కాగా ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం మావోల దాడిలో 75 మంది సిఆర్పిఎఫ్, ఒక పోలీసు మృతి చెందారు.