అత్యాశకు పోవద్దు: రంగంలో భవిష్యవాణి హితవు
పూజలు సరిగా చేయడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కోరినన్ని వర్షాలు తప్పకుండా కురుస్తాయని చెప్పారు. ధరలు పెరుగుతాయన్నారు. మహాకాళేశ్వర స్వామిని ప్రతిష్టించాలని గతంలోనే తాను కోరానని, కానీ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని, ఆ పనిని తానే పూర్తి చేసుకుంటానని చెప్పారు.
కుల, మతాలకు అతీతంగా అందరూ తనకు సమానమే అని చెప్పారు. కుల, మతాలు కేవలం మనుషులు సృష్టించుకున్నవన్నారు. ప్రజలు అందర్నీ సంతోషంగా ఉంచుతానని, ప్రజల కోరికలు తీరుస్తానని చెప్పారు. పెద్ద పూజారి ప్రశ్నలు అడుగుతుండగా భవిష్యవాణి వాటికి సమాధానం చెప్పారు. రంగం కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, సనత్ నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
కాగా ఆదివారం ఉదయం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ, మర్రి శశిధర్ రెడ్డి, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.