రాష్ట్రపతి ఎన్నిక: రేపు కాంగ్రెసు ఎమ్మెల్యేల సమావేశం
యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తరఫున ఎన్నికల ఏజెంటుగా నమూనా పోలింగులో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యవహరిస్తారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని అనిల్ చెప్పారు. కాగా, రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం శానససభ ఆవరణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 294 శానససభ్యులు గల సభలో కాంగ్రెసుకు 155 మంది శాసనసభ్యుల బలం ఉంది. ప్రణబ్ ముఖర్జీకి మజ్లీస్కు చెందిన ఏడుగురు శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులున్నారు.
ఇదిలా వుంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన వైఖరిని వెల్లడించలేదు. తెరాస పోలింగుకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.