రెండోసారి: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్
ఎన్డీయే అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ ఉప రాష్ట్రపతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సర్వేపల్లి రాధాకృష్ణ రెండుసార్లు పోటీ చేశారు. ఆ తర్వాత హమీద్ అన్సారీ కూడా రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో అన్సారీ వామపక్షాల మద్దతుతో యుపిఏ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అన్సారీ 790 ఓట్లకు గాను 470 ఓట్లు పొందే అవకాశముందని కాంగ్రెసు భావిస్తోంది. ఒకవేళ తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చినట్లుగానే అన్సారీకి కూడా ఓకే అంటే మరో 28 ఓట్లు పెరిగే అవకాశముంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే అన్సారీకి 396 ఓట్లు రావాలి.
కాగా రాష్ట్రపతి ఎన్నికలు జూలై 19న జరగనున్న విషయం తెలిసిందే. యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ బరిలో నిలవగా ఎన్డీయే అభ్యర్థిగా పిఏ సంగ్మా రేసులో ఉన్నారు. అన్సారీ రెండోసారి నామినేషన్ వేయడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ప్రధాని చెప్పారు.