చలానా రాశారని చేయి చేసుకున్న మహిళా మేనేజర్
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన 32 ఏళ్ల దివ్య హోంగార్డు శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ రాజగోపాల్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చేయి చేసుకుంది. దివ్య మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కారును అక్కడ పెట్టింది. నో పార్కింగ్ ప్రదేశంలో పెట్టినందుకు ట్రాఫిక్ పోలీసులు ఆమెకు రూ.200 చలానా వేశారు. కారు పార్కు చేసిన అనంతరం దివ్య లోపలకు వెళ్లింది. అప్పటికే ఆమె డ్రైవర్ మొహమ్మద్ మోసిన్ చలానాను కట్టాడు.
బయటకు వచ్చిన దివ్య తనకు చలానా వేసిన విషయాన్ని తెలుసుకుంది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడింది. చలానా ఎందుకు కట్టించుకున్నారని వారితో వాదనకు దిగింది. పోలీసు చేతిలో ఉన్న చలానా పుస్తకాన్ని చించి వేసింది. దీంతో ఎస్ఐ రాజగోపాల్ ట్రాఫిక్ పోలీస్ శ్రీనివాస్తో ఆమె ఫోటో తీసుకోమని చెప్పాడు. దీంతో మరింత ఆగ్రహం చెందిన దివ్య వారిపై దాడి చేసింది. ఓ సమయంలో వారి కాలర్ పట్టుకుంది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో ఆమెను మూడ గంటల సమయంలో అరెస్టు చేశారు. దివ్య పైన ఐపిసి 332, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దివ్యను విచారించిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.