వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనలాగే ఎంజాయ్ చేసేలా చూడాలి: మంచు మనోజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manchu Manoj
హైదరాబాద్: ప్రకృతిని కాలుష్యం నుండి రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ హీరో మంచు మనోజ్ ఆదివారం అన్నారు. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థ పదార్థాలు వేయకుండా కాపాడుకోవాలని ఇండియన్ ఆర్మీ, 92.7 బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు.

ఇలాంటి కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండటం అందరి బాధ్యత అన్నారు. హుస్సేన్ సాగర్‌ను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టం బాగుందన్నారు. సాగర్‌ను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పాత తరాలు మనకు అందించిన వాటిని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నామని, భవిష్యత్తు తరాలు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలంటే కాలుష్యం నివారించాలన్నారు. సాగర్‌లో చెత్త, ప్లాస్టిక్ వేయకూడదని సూచించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సరస్సును కాపాడుకోవాలని, దానిని క్లీన్‌గా ఉంచేలా చూడాలన్నారు. చట్టాలను పూర్తిగా ప్రభుత్వంచే అమలు చేయించే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రతి పౌరుడు రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అందరి బాధ్యత అన్నారు. సరస్సును కాపాడుకోవాలని, దానిని గ్రీన్‌గా, క్లీన్‌గా ఉంచాలని, అలా ఉంటేనే మనమూ బాగుంటామన్నారు. ప్లాస్టిక్ వాడకలను నిరోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

కాగా నెక్లస్ రోడ్డు నుండి సెయిలింగ్ క్లబ్ వరకు ప్రదర్శన కొనసాగింది. వాక్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

English summary
Hero Manchu Manoj has participated in go-green programme at Hussain Sagar of Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X