'ఈగ' దారిలో: కిషన్, ఎదురు చూస్తున్నా... ఉమాభారతి
వచ్చే నెలలో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై చర్చించేందుకు వారం రోజులు ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితుల హత్య కాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ హక్కులతో చెలగాటమాడుతోందని, ప్రజలకు రక్షణ కల్పించేందుకు కమిషన్లు ఏర్పాటు చేయాలని కోరుతుంటే.. పాలకులు మాత్రం ప్రాజెక్టుల కమీషన్ల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగ పురుషులు అవతరించాలని ప్రజలు ఎలా ఎదురు చూశారో.. తెలంగాణ ఆవిర్భావం కోసం తానూ ఎదురు చూస్తున్నానని యువమోర్చా మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత ఉమా భారతి పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాలక మండలిని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్తో దళిత మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు వద్ద మూడు రోజుల మహా ధర్నా ప్రారంభమైంది. గంగానది పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శ్రీశైలం వెళ్లి వచ్చిన ఉమా భారతి శనివారం సాయంత్రం ధర్నా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు.
తెలంగాణ కోసం ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారని, ఈ ఉద్యమాన్ని తొలి నుంచీ తాను గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పాలక మండలి లేకపోవడం దురదృష్టకరమని, ఇక, వారికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పాలక మండలి ఏర్పాటు, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఎస్సీ, ఎస్టీలు సింహాల్లా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పోరాటాలకు తానూ వెన్నంటే ఉంటానని భరోసా ఇచ్చారు.