మీడియాకు అన్నాహజారే సారీ, సపోర్టర్స్కు హెచ్చరిక
విలేకరులపై జరిగిన దాడికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇందుకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలను సాకుగా చూపి ప్రభుత్వం రెండు రోజుల్లో దీక్షా శిబిరాన్ని మూయించి వేస్తుందని మద్దతుదారులకు సూచించారు. అవినీతిపై పోరును మీడియాతో కలిసే తాము కొనసాగిస్తామని తెలిపారు. దాడి ఘటనను అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు.
గత రాత్రి జంతర్ మంతర్ వద్ద మీడియాపై అన్నా బృందం దాడిని, వారి వ్యాఖ్యలను బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తమ ఆందోళనను మీడియా సరిగా కవర్ చేయడం లేదంటూ గత రాత్రి అన్నా మద్దతుదారులు మీడియాకు చెందిన ఓ బృందంపై దౌర్జన్యం చేశారు. తాము తమ విధులను సరిగానే నిర్వర్తిస్తున్నామని, అన్నా బృందం తమ నిరంకుశ ప్రవర్తనకుగాను క్షమాపణచెప్పాలని ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దీంతో తగ్గిన అన్నా బృందం క్షమాపణలు చెప్పింది. కాగా అన్నా దీక్ష మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది.
మరోవైపు అవినీతిపై పోరులో భాగంగా దీక్ష చేపట్టేందుకు ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కోసం రాంలీలా మైదానంలో వేసిన టెంట్ ఈ రోజు కూలిపోయింది. భారీ వర్షం కారణంగా ఈ టెంట్ కూలి నలుగురు కూలీలు గాయపడ్డారు. ఇక్కడి నుంచే ఆగస్టు 9న రాందేవ్ తన దీక్షను ప్రారంభిస్తారు. విదేశాలలోని నల్ల ధనాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టనున్నారు.