జెడి కాల్లిస్ట్: సాక్షి విలేకరికి బెయిల్, లొంగిపోవాల్సిందే
ముందస్తు బెయిల్ కోసం యాదగిరి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు విచారణ చేపట్టారు. చంద్రబాల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన నేరారోపణలు తీవ్రమైనవని, హేయమైనవి కానందున.. పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కేసులో పలుకుబడి గల వ్యక్తుల పేర్లు ఉన్నంత మాత్రాన న్యాయవ్యవహారాల్లో దాని ప్రభావమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఆగస్టు 14వ తేదిలోగా హైదరాబాద్ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు.
రూ.10వేల బాండ్, ఇద్దరి పూచికత్తులు ఆ కోర్టుకు సమర్పించి బెయిల్ పొందాలని పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ కేసులో దర్యాఫ్తు అధికారి ఎవరైనా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేస్తే, తదుపరి విచారణకు సహకరించాలని షరతు విధించారు.