ఇద్దరు మహిళలపై కత్తి పట్టుకు తిరుగుతున్న సైకో దాడి
వెంటనే అప్రమత్తమైన అనీల్ కుటుంబ సభ్యులు అతనిని అడ్డుకున్నారు. ఆ తర్వాత మరో మహిళ పైన కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇది సైకో పనే కావొచ్చునని అనుమానిస్తున్నారు. అయితే గతంలో నాలుగు జిల్లాలను వణికించి పోలీసుల కన్నుగప్పి పారిపోయిన సైకో సాంబ పని మాత్రం కాదని చెబుతున్నారు. అతని ఆనవాళ్లు తాజాగా దాడి చేసిన వ్యక్తిలో లేవని చెబుతున్నారు. అలాగే కేరళ నర హంతకుడు ఆంటోనీ గుర్తులు కూడా లేవని చెబుతున్నారు.
దీంతో నెల్లూరులో అంటోనీ కాకుండా మరో సైకో తిరుగుతున్నాడా అనే చర్చ ప్రారంభమైంది. కాగా నాలుగు జిల్లాలను వణికించిన సైకో సాంబశివ రావును గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే ఆ తర్వాత అతను పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఎక్కడ సైకో అటాక్ జరిగినా సాంబ వైపు వేళ్లూ చూపిస్తున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో బస్సులోనే ముగ్గురిని హత్య చేసిన ఘటనలోనూ తొలుత సైకో సాంబను, ఆ తర్వాత ఆంటోనీని కూడా అనుమానించారు. కానీ ఆ తర్వాత ఈ ఘటనలో సాంబశివ రావు పాత్ర లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.