మార్చ్తో సత్తా, జానా ఆలోచన సరి కాదు: కోదండరామ్
శుక్రవారం నల్లగొండలో టీజేఏసీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యమం బలంగా నిర్వహించటంతోపాటు నిత్య జీవితంలో భాగమయ్యేలా చూడాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. సీమాంధ్ర పాలన వల్ల జరుగుతున్న అన్యాయాలను ఎండగడతామని చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలు సంఘటితమయ్యారని తెలిపారు. రాష్ట్ర మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశించటం సమంజసం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పదవులు చేపడితే ప్రతిఘటించి తీరతామన్నారు.
రాష్ట్రంలోని మూడుప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే శ్రేయస్కరమని పేర్కొంటున్నారని ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్రసమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. సద్భావనతో విడిపోవాలనే స్వాతంత్య్ర సమరయోధుల పిలుపుకు బ్రహ్మాండమైన స్పందన వస్తోందని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హైదరాబాద్ నగర హెచ్ఎఎల్ ఉద్యోగి, రచయిత మురళీకృష్ణ రూపొందించిన విభజన రంగంలో నేనే అయితే ఆడియో సీడీ ఆవిష్కరణ సభ కార్యక్రమం శుక్రవారం అశోక్నగర్లోని కొండా లక్ష్మణ్బాపూజీ నివాసంలో జరిగింది.
సీడీని ఆవిష్కరించిన కొండాలక్ష్మణ్ బాపూజీ మాట్లాడారు. ఆంధ్రలో వద్దంటున్నా విలీనం చేసిన తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాల గురించి వాస్తవాలను వెల్లడించి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర రాష్ట్రాల నిర్మాణానికి ఏవిధంగా కృషి చేయాలనే అంశాలను సీడీలోని పాటలద్వారా రచయిత మురళీకృష్ణ వెల్లడించారన్నారు. తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసి తెలంగాణాకు అన్యాయం చేశారని అందుకే విడిపోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఈ సీడీలోని పాటలద్వారా ప్రజల్లో మరింత చైనత్యం వస్తుందన్నారు.