గ్యాస్ ప్రకంపనలు: ఢిల్లీకి పంచాయతీ, వెళ్లనున్న కిరణ్
ఈ భేటీలో అధికారులు గ్యాస్ మళ్లింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ను ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మరింత ఇక్కట్లలోకి నెట్టి వేయబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సాహు, ట్రాన్సుకో సిఎండి హీరాలాల్ పాల్గొన్నారు.
పలువురు అధికారులు రాష్ట్ర అవసరాలకు సరిపడా గ్యాస్ను కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కిరణ్కు విజ్ఞప్తి చేశారు. దీంతో గ్యాస్ను కేటాయించాలని ప్రధానికి మరో లేఖ రాసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే సమయంలో గ్యాస్ కొరతపై ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు కిరణ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందు కోసం ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంట్ కోరారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధానితో కిరణ్ గ్యాస్ కొరత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పనున్నారు.
కాగా మహారాష్ట్రకు గ్యాస్ తరలించడంపై సిపిఐ నారాయణ విజయవాడలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మేలు చేసే విషయంలో కిరణ్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిలు విఫలమయ్యారన్నారు. గ్యాస్ తరలింపు విషయంపై చర్చించేందుకు రేపు హైదరాబాదులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం లెనిన్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు.