హైదరాబాదులో పేలుడు కలకలం, నలుగురికి గాయాలు
ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికిలు వెంటనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటన సాయినాథ్ గ్లాస్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్యాడ్ తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
చిత్తూరులో అగ్ని ప్రమాదం
మరోవైపు చిత్తూరు జిల్లా వుత్తూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్ బోర్డు, స్టార్ రూమ్ తీగలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.
ఇదే జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం నెలవాయిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు దుండగులు విక్టోరియా ప్లాస్టిక్ కంపెనీకి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 20 లక్షల రూపాయల నష్టం జరిగినట్లుగా అంచనా.