ఎల్లుండి జగన్ బెయిల్పై విచారణ: శ్రీలక్ష్మి పిటిషన్ ఓకే
శ్రీలక్ష్మి బెయిల్ కేసు విచారణ 13న
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. తదుపరి వాదనలను ఈ నెల 13వ తేదికి వాయిదా వేసింది. ఇప్పటికే ఆమె నాంపల్లిలోని సిబిఐ కోర్టు, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. కింది కోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీం సూచించడంతో ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మోపిదేవి బెయిల్ పిటిషన్ కూడా..
జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్పై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 10వ తేదికి వాయిదా వేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మోపిదేవి ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించింది.