జెడి కాల్ డేటా లీక్: పరారీలో కెవిపి వియ్యంకుడు
మీడియా కథనాల ప్రకారం - దాంట్లో భాగంగా రఘురామరాజు ఎంవీ రావు అనే వ్యాపారవేత్తను రంగంలోకి దింపారు. ఆయన తనకు తెలిసిన బీఎస్ఎన్ఎల్ అధికారి హనుమంతు ద్వారా జేడీ కాల్ డేటాను సేకరించారు. అయితే విషయం బయటకు పొక్కడంతో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన రఘురామరాజు మహారాష్ట్రలోని తన కంపెనీ ఇంద్ భారత్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడైన కె. వెంకారెడ్డి ద్వారా తప్పు కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అక్కడి మరాఠా మహిళతో జెడి నెంబర్తో బెదిరింపులు వస్తున్నాయంటూ నాందేడ్లోని మఖద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. వెంకారెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. కాల్డేటా సేకరణలో తెరవెనుక వ్యవహారం నడిపింది రఘురామరాజేనని తేలింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధపడింది.
విషయం తెలుసుకున్న ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అరెస్టు చేద్దామని ప్రయత్నిస్తున్న సీఐడీ అధికారులకు ఆయన ఆచూకీ లభించలేదు. సెల్ నెంబర్కు ఫోన్చేస్తే స్విచాఫ్ అన్న మాటే వినిపిస్తోందని అంటున్నారు.