జెడి కాల్లిస్ట్లో కొత్త మలుపు: అప్పీల్ పిటిషన్ వాపస్
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి భావు ఆ పిటిషన్ను కొట్టి వేశారు. దీన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పుపై మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని, ఉపసంహరణకు అనుమతివ్వాలని అభ్యర్థించారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఉపసంహరణకు అనుమతించింది. మరోవైపు జెడి కాల్లిస్టు కేసులో సిఐడి అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఆ కాల్డేటా కోసం నాందేడ్ పోలీసులకు ఆయనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని రఘురామ రాజు కంపెనీ వైస్ చైర్మన్ కెవి రెడ్డి నిర్ణయించారు.
అయితే పోలీసులకు అనుమానం రాకుండా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో జనవరి 16న నాందేడ్లోని మఖద్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కెవి రెడ్డిని కస్టడీకి తీసుకున్న అధికారులు ప్రశ్నించినప్పుడు ఆమె స్వస్థలం నాందేడ్ అని, పేరు సవిత అని, ఇంద్ భారత్ కంపెనీ సమీపాన ఉంటారని వివరించారు. దీంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లి వాకబు చేయగా కెవి రెడ్డి మరాఠీ భాషలో రాయమంటే రాసి ఇచ్చానని తప్ప కుట్రతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. దీంతో సవితతో మరోసారి లేఖ రాయించి, మునుపటిదానితో పోల్చిచూడటం కోసం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబ్కు పంపారు.
అయితే తనకు కాల్డేటా వివరాలేవీ అందలేదని, గతంలో సేకరించిన డేటా ఆధారం కోసమే తనతో ఫిర్యాదు చేయించారని కెవిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు.. సామాజిక కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల కాల్డేటా కోసం నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా నంబర్లతో ఆమె నంబర్ను కలిపి నాచారం సిఐ శ్రీనివాస రావు, దాన్ని సర్వీస్ ప్రొవైడర్కు పంపారు. ఈ విషయాలను సిఐడి కోర్టుకు వివరించింది. శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా సిఐడి న్యాయవాది ఈ మేరకు కోర్టు దృష్టికి తెచ్చారు.