భార్యమీది కోపంతో చిన్నారిని నేలకు బాది చంపిన తండ్రి
అత్త మీది కోపం దుత్తమీద అన్న చందంగా తన భార్య పైన ఉన్న కోపాన్ని సదరు కిరాతక తండ్రి తన చిన్నారి పైన చూపించాడు. పదిహేను నెలల తన కూతురు చిన్నారిని గాల్లోకి గిరగిరా తిప్పేసి నేలకేసి బాదాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు దామోదరంను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి ఏడుస్తూ తన కూతురును అన్యాయంగా చంపేశాడని విలపించింది.
మరోవైపు గుంటూరు జిల్లాలోని నకిరికల్లు మండలంలో బుధవారం ఉదయం జగన్నాథ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు భూవివాదంలో మధ్యవర్తిగా తెలుస్తోంది. ఇతడు ఒక వైపు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మరొకరికి ఆగ్రహం కలిగించి ఉండవచ్చునని భావిస్తున్నారు.