హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యమీది కోపంతో చిన్నారిని నేలకు బాది చంపిన తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్/గుంటూరు: భార్య మీది కోపంతో ఓ కిరాతక తండ్రి పదిహేను నెలల చిన్నారిని నేలకేసి బాది చంపేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని గగన్‌పాడులో దామోదరం దంపతులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య దగ్గరలో ఉన్న తన అక్క వద్దకు వెళ్లింది. ఇంటికి రమ్మంటే కోపంతో ఉన్న ఆమె రాలేదు. దీంతో భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అత్త మీది కోపం దుత్తమీద అన్న చందంగా తన భార్య పైన ఉన్న కోపాన్ని సదరు కిరాతక తండ్రి తన చిన్నారి పైన చూపించాడు. పదిహేను నెలల తన కూతురు చిన్నారిని గాల్లోకి గిరగిరా తిప్పేసి నేలకేసి బాదాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు దామోదరంను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి ఏడుస్తూ తన కూతురును అన్యాయంగా చంపేశాడని విలపించింది.

మరోవైపు గుంటూరు జిల్లాలోని నకిరికల్లు మండలంలో బుధవారం ఉదయం జగన్నాథ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు భూవివాదంలో మధ్యవర్తిగా తెలుస్తోంది. ఇతడు ఒక వైపు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మరొకరికి ఆగ్రహం కలిగించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

English summary
A father from Hyderabad was killed his fifteen months daughter on Wednesday. He was arrested by Hyderabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X