వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌లో నాలుగు వరుస పేలుళ్లు: సిఎం జిల్లాలోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bomb Blasts
ఇంఫాల్: ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాష్ట్ర రాజధానితో పాటు తౌబాల్‌లోని ఓ ప్రాంతంలో నాలుగు పేలుళ్లు జరిగాయి. ఇంపాల్‌లో వరుసగా మూడు, తౌబాల్‌లో ఓ పేలుడు జరిగింది. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. పేలుళ్లు జరిగింది ముఖ్యమంత్రి ఓక్రాం సొంత జిల్లా కావడం గమనార్హం. అదీకాకుండా ఓ వైపు భారత్ 66వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

ఇంఫాల్‌లోని మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్ సమీపంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు భయకంపితులయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని పోలీసులు ధృవీకరించారు.

English summary
Four blasts struck northeastern state of Manipur on Independence Day on Wednesday. Police said four persons have been seriously injured in the series of blasts. According to reports, three blasts took place in the capital Imphal while the fourth one occurred in Thoubal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X