ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ముంబయి బార్ గర్ల్స్ పట్టివేత
మంగళవారం రాత్రి 8.25 గంటలకు దుబాయ్ వెళ్లే విమానంలో ముంబయికి చెందిన 37 మంది బార్ గర్ల్స్ ప్రయాణించాల్సి ఉందని, ఆ యువతులంతా డ్యాన్సర్లుగా చలామణి అవుతూ గమ్యం చేరుకోగానే మధ్యవర్తులు వీరిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతారని ముంబయి పోలీసు సామాజిక సేవా విభాగం అధికారి ఒకరు తెలిపారు.
విషయం తెలుసుకున్న ముంబయి ఎసిబి వసంత్ డోబ్లే ఈ ముఠా గుట్టు రట్టు చేశారన్నారు. అరబ్ దేశాలలో ముంబయి బార్ గర్ల్స్కు విపరీతమైన డిమాండ్ ఉంది. మరోవైపు వారికిదే ఆదాయ వనరు కావడంతో విదేశాలకు వెళ్లేందుకు వారూ మొగ్గు చూపుతుంటారు. విమానాశ్రయంలోని కొందరు అధికారులతో గల్ఫ్ ఏజెంట్లకున్న సంబంధాల వల్ల వీరి వాస్తవికతను తనిఖీ చేయకుండా వీసాలు క్లియర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
2005 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లను నిషేధించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించడం వల్ల వీరిని ఢిల్లీ, చెన్నై, హైదరాబాదు మీదుగా విదేశాలకు పంపడం ప్రారంభించారు. పోలీసు బిల్లును ఆమోదించడం ద్వారా డ్యాన్స్ బార్లను మూసివేయించినప్పటిక ఆ మహిళలకు జీవనోపాధి కల్పించడంలో మాత్రం సర్కారు విఫలమైంది.