బాలకృష్ణ తెలంగాణ ప్రకటనపై అడుసుమిల్లి ఫైర్
ఈ మేరకు అడుసుమిల్లి గురువారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. సాగునీటి విడుదల.. విద్యార్థుల కౌన్సెలింగ్, తెలుగు సినిమా షూటింగ్లను అడ్డుకొన్నప్పుడు బాలకృష్ణ ఎందుకు జోక్యం చేసుకోలేదని, తాము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని, తమ జోలికి రాకండి అని ఆనాడు బాలకృష్ణ ప్రకటన చేసి ఉండొచ్చు కదా అని, ఇంత ఆలస్యంగా కళ్లు తెరవటంలో ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు చంద్రబాబు కప్పదాటు రాజకీయాలను మాత్రమే అసహ్యించుకుంటున్న సీమాంధ్ర ప్రజలు, ఇక బాలకృష్ణ సినిమాలనూ తిరస్కరించటం మొదలుపెడతారని తెలిపారు. తెలుగువారి ఐక్యత, ఆత్మగౌరవం కోసం పాటుపడిన ఎన్టీఆర్ తనయుడిగా తెలుగువారి విభజనకు సమ్మతించటం సరైందేనా? అని బాలకృష్ణను నిలదీశారు.
"సొంత బావకు నచ్చచెప్పాల్సింది పోయి, మరేదో రాజకీయ ప్రయోజనం ఆశించి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారా? లేక రాష్ట్ర విభజనకు కేంద్రం అంగీకరించే స్థితిలో లేదని కచ్చితంగా తెలుసుకొని టీడీపీ ఆడుతున్న కొత్త నాటకంలో బాలకృష్ణ పావుగా మారాడా?'' అనే సందేహాలను అడుసుమిల్లి వ్యక్తంచేశారు.