హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెడి కాల్‌లిస్ట్: బెయిలిచ్చారు,లుక్‌ఔట్ వద్దు..రఘురామ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్టు వ్యవహారంలో తనకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందుతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ రాజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ జెడి ఫోన్ కాల్ లిస్టు దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న తనకు కింది కోర్టు బెయిల్ మంజూరు చేసిందని అందులో సూచించారు. ఈ విషయాన్ని సిబిఐకి తెలియజేసినా లుక్ ఔట్ నోటీసును విరమించుకోలేదని ఆయన హైకోర్టుకు తెలిపారు.

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులో ఎ1గా ఉన్న సిబిఐ కోర్టు మాజీ జడ్జి పట్టాభి రామారావు మరో మారు బెయిల్ పిటిషన్ వేశారు. తొలి రెండుసార్లు కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ మంజూరీ కుదరదంటూ ఎసిబి కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో తాజగా పట్టాభి మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే కేసులో నిందితులు చలపతి రావు, రవిచంద్ర బెయిల్ పిటిషన్ల పైనా గురువారం వాదనలు విన్న జడ్జి తీర్పును శనివారానికి వాయిదా వేశారు. ఇక గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు 27కు వాయిదా పడ్డాయి. ప్రత్యేక ఖైదీలుగా పరిగణించాలంటూ సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా శనివారానికి వాయిదా వేశారు.

English summary
Raghurama Raju, who is accused in CBI JD Laxminarayana call list has filed a petition in High Court on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X