యుక్త వయస్సులోని కూతుళ్లపై తండ్రి దాష్టీకం, అరెస్ట్
గతంలో తమకు ఉన్న ఆస్తులను తమ తండ్రి అమ్మేసి వేరే మహిళను వివాహం చేసుకుని తమకు అన్యాయం చేశాడని, తాము జీవనం కోసం షాపుల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తుంటే డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడని, సింగరాయపాలెంలో మిగిలిన ఇళ్ళ స్థలం కూడాఅమ్మేయాలని చూస్తున్నాడని హనుమంతరావు కుమార్తెలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కూతుళ్ళమని కూడా చూడకుండా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నాడని, తమ తండ్రి నుంచి ప్రాణహాని లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి మచిలీపట్నంలో ఉంటున్న హనుమంతరావును అరెస్టు చేశారు. నిందితుడు హనుమంతరావుపై కుటుంబ సభ్యుల వేధిస్తున్న సంఘటనలో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
పిల్లల్ని తిట్టి, కొట్టినందుకు వేధింపులకు గురి చేసినందుకు, రెండో వివాహం చేసుకుని మోసం చేసినందుకు తదితర అంశాలకు సంబంధించి 494, 354, 506, 323, 406సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడికి 15 రోజులు సబ్ జైలు రిమాండ్ను కైకలూరు మెజిస్ట్రేట్ విధించినట్టు ఎస్సై తెలిపారు.