రొమాంటిక్ కథ: 50పెళ్లిళ్లు చేసుకున్న కి'లేడీ' కేరళకుట్టి
షహనాజ్ గత కొంతకాలంగా చెన్నైలో ఉంటోంది. చెన్నై నగరంలోనే ఏడుగురుకి పైగా యువకులు ఆమెపై వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తవ్వి తీస్తే ఆమె దాదాపు యాభై వరకు పెళ్లిళ్లు చేసుకొని వారిని మోసగించి ఉంటుందని అనుమానిస్తున్నారు. చెన్నైలో ఉంటున్న మణికంఠకు షహనాజ్తో పరిచయం అయింది. అది స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అతనితో కలిసి కొన్ని నెలలు ఉంది. ఆ తర్వాత లాకోర్సు అని, సివిల్ ఎక్సామ్స్ అని చెప్పి ఉమెన్ హాస్టల్లో చేరింది. ఆమె కోసం మణికంఠ రెండు లక్షల రూపాయాలకు పైగా ఖర్చి పెట్టాడు.
కొద్ది రోజుల తర్వాత షహనాజ్ ఉమెన్ హాస్టల్ నుండి అదృశ్యమైంది. గత సంవత్సరం నవంబరు నుండి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఇతను అడియార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె మిస్ కాలేదని, మిస్ అనేది షహనాజ్ తన వద్ద డబ్బులు పట్టించి ప్రీ ప్లాన్డ్గా మిస్ అయిందని ఆలస్యంగా తెలుసుకున్నాడు. సురేష్ అనే వ్యక్తి కూడా ఇదే రకంగా షహనాజ్ చేతిలో మోసపోయాడు. అతను మరో స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశాడు.
చివరగా ఆమె ప్రసన్న అనే ఫుట్బాల్ ప్లేయర్తో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇది తెలుసుకున్న పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అందరిలాగే తాను కూడా ఆమె చేతిలో మోసపోయానని అతను పోలీసుల ఎదుట నీరుగారిపోయాడు. ప్రసన్న తర్వాత ఆమె ఎవరిని వలలో వేయడానికి వెళ్లిందో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.
ఇప్పుడు ఈ షహనాజ్ చెన్నై పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారింది. తీవ్రంగా గాలిస్తున్నారు. నిత్య పెళ్లి కూతురులా మారిన షహనాజ్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్లలో అనర్గళంగా మాట్లాడగలదట. అందుకే ఎక్కడకు వెళ్లినా అక్కడి వారిని వీజీగా బుట్టలో పడేస్తుందని భావిస్తున్నారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులే ఆమె టార్గెట్ అని పోలీసులు గుర్తించారు.