వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాము కరిచిందని..: వెంటపడి మరీ కొరికి చంపేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nepal Map
ఖాట్మాండు: ఓ నేపాలీ రైతు నాగుపామును కొరికి కరిచిన సంఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. ఆ పాము తనను కరిచినందుకు టిట్ ఫర్ టాట్ అంటూ దానిని కర్రతో కొట్టి కాకుండా నోటితో కొరికి చంపాడు. ఈ వార్తను నేపాల్ దిన పత్రిక అన్నపూర్ణ డెయిలీ పోస్ట్ గురువారం రోజు ప్రచురించింది. మొహమ్మద్ సాల్మో మియా అనే రైతు మంగళవారం రోజు తనను కరచిన ఓ నాగుపాము వెంటపడి దానిని పట్టుకొని కొరికి చంపాడు.

అతను తన వరిపొలంలో పని చేసుకుంటుండగా ఆ పాము అతడిని కాటేసింది. దాంతో విపరీతంగా కోపం వచ్చిన సాల్మో ఆ పాము వెంట పడి మరీ కొంత దూరంలోనే పట్టుకున్నాడు. కోపం ఆపుకోలేక దాన్ని తన నోటితో కొరికి చంపేశాడు. ఘటన జరిగిన వెంటనే సాల్మోను గ్రామంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.

దీనిపై సాల్మో స్పందిస్తూ.. తాను తనను కరచిన నాగుపామును తాను కర్రతో గానీ మరో వస్తువుతో గానీ చంపవచ్చునని, కానీ తనకు బాగా కోపం వచ్చినందున అదే ఆవేశంలో కొరికి చంపినట్లు చెప్పాడు. సాల్మా వయస్సు 55. ఇతను నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఉంటాడు.

English summary
A Nepali man who was bitten by a cobra snake bit it back and killed the reptile in a tit-for-tat attack, a newspaper said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X